
Indian Railways: ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఈ మార్పు ప్రయాణీకులు తమ కన్పర్మ్ అయిన రైలు టిక్కెట్ల తేదీని మార్చడానికి అనుమతిస్తుంది. ఇంకా కన్ఫర్మ్ టికెట్ను తరువాతి తేదీకి మార్చడానికి ఎటువంటి రద్దు ఛార్జీలు ఉండవు. అంటే మీరు నవంబర్ 20న పాట్నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ కలిగి ఉంటే, ఏదైనా కారణం వల్ల ఐదు రోజుల తర్వాత మీ ప్లాన్ మారితే, మీరు నవంబర్ 25కి కొత్త టికెట్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీరు మీ నవంబర్ 20న ధృవీకరించబడిన రైలు టికెట్ తేదీని ఆన్లైన్లో మార్చుకోవచ్. అదే టికెట్ని ఉపయోగించి నవంబర్ 25న పాట్నాకు ప్రయాణించవచ్చు.
ప్రస్తుత వ్యవస్థ ప్రకారం, మీ ప్రయాణ ప్రణాళికలు మారితే, మీరు మీ టికెట్ను రద్దు చేసి, తదుపరి తేదీకి కొత్తదాన్ని తిరిగి బుక్ చేసుకోవాలి. దీని ఫలితంగా రద్దు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా తదుపరి తేదీకి కన్ఫర్మ్ టికెట్ పొందడం అసాధ్యం.
ధృవీకరించిన టిక్కెట్ల రీషెడ్యూల్కు సంబంధించి రైల్వేలు ఒక పెద్ద మార్పును అమలు చేస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది ప్రయాణీకులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందన్నారు. దీని ప్రకారం, కన్ఫర్మ్ రైలు టికెట్ ప్రయాణ తేదీని ఆన్లైన్లో మార్చడానికి ఎటువంటి రుసుము ఉండదన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి