
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన విషయం తెలిసిందే. దీని కోసం ఇరుపక్షాలు 2007 నుండి చర్చలు జరుపుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారు అయింది. దీనివల్ల యూరోపియన్ యూనియన్ నుండి భారతదేశానికి వచ్చే అనేక వస్తువులు చౌకగా లభిస్తాయి. అయితే ఈ భాత్ – EU FTAని ప్రకటిస్తూ ప్రధానమంత్రి మోదీ దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అని అభివర్ణించారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏకీకరణకు ఈ ఒప్పందం ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ప్రధాని మోదీ దీన్ని అద్భుతంగా వర్ణిస్తూ అలా అన్నారు. కాగా ఈ ఒప్పందం కారణంగా మన దేశంలో మెర్సిడెస్, విమానం, ఎలక్ట్రానిక్స్, యూరోపియన్ వైన్లు వంటి లగ్జరీ కార్లు చౌకగా మారతాయి. ఇది సేవా రంగంలో భారతీయులకు కొత్త అవకాశాలను కూడా తెరుస్తుంది. ఎమ్కే గ్లోబల్ ప్రకారం, రెండింటి మధ్య వాణిజ్యం 2031 నాటికి 51 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి