Bank Account: ఈ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌!

Bank Account: తన కస్టమర్లకు మరో ముఖ్యమైన సలహా ఇచ్చింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దని లేదా ఏదైనా తెలియని ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని బ్యాంక్ తెలిపింది. కేవైసీని అప్‌డేట్ చేయడానికి కస్టమర్లు బ్రాంచ్‌ను..

Bank Account: ఈ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌!

Updated on: Mar 03, 2025 | 2:59 PM

డిసెంబర్ 31, 2024 వరకు KYC అప్‌డేట్ చేయని ఖాతాదారుల కోసం ఈ హెచ్చరిక వర్తిస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. అంటే, మీ ఖాతా యొక్క KYC అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే, మీరు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. లేకపోతే, లావాదేవీని నిలిపివేయవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లక్షలాది మంది ఖాతాదారులకు సంబంధించిన పెద్ద వార్తలు వెలుడింది. ఎంపిక చేసిన కస్టమర్లు KYC ని అప్‌డేట్ చేయాలని బ్యాంకు కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. సకాలంలో KYC ని అప్‌డేట్ చేయని ఖాతాదారుల ఖాతాలను బ్లాక్ చేయవచ్చని ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. అటువంటి పరిస్థితిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు చేయడానికి, నిర్ణీత సమయానికి ముందే మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోండి.

డిసెంబర్ 31, 2024 వరకు కేవైసీ అప్‌డేట్ చేయని ఖాతాదారుల కోసం ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. అంటే, మీ ఖాతా KYC అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే, మీరు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. లేకపోతే లావాదేవీని నిలిపివేయవచ్చు.

కేవైసీ అప్‌డేట్‌ కోసం పద్దతులు

పీఎన్‌బీ తన కస్టమర్లకు మరో ముఖ్యమైన సలహా ఇచ్చింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దని లేదా ఏదైనా తెలియని ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని బ్యాంక్ తెలిపింది. కేవైసీని అప్‌డేట్ చేయడానికి కస్టమర్లు బ్రాంచ్‌ను సంప్రదించాలని లేదా అధికారిక మార్గాలను ఉపయోగించాలని పంజాబ్‌నేషన్‌ బ్యాంకు తెలిపింది.

పీఎన్‌బీ యాప్ ఉపయోగించి ఇంటి నుండే KYCని అప్‌డేట్ చేయండి:

  • మీరు ఇంటి నుండే కేవైసీని అప్‌డేట్ చేయాలనుకుంటే PNB ONE యాప్ ద్వారా చేయవచ్చు.
  • ముందుగా PNB ONE యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
  • KYC స్థితిని తనిఖీ చేయండి.
  • KYC అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే అప్‌డేట్ KYC పై క్లిక్ చేయండి.
  • OTP ద్వారా ఆధార్ ప్రామాణీకరణను పూర్తి చేయండి.

KYC ని ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి ఇది మార్గం:

మీరు మీ ఖాతా కేవైసీని ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయాలనుకుంటే, దీని కోసం మీరు మీ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖకు వెళ్లాలి. ఇక్కడ మీరు మీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, తాజా ఫోటో, పాన్ లేదా ఫారం 60, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్‌ను సమర్పించాలి. మీరు ఈ పత్రాలను రిజిస్టర్డ్ ఇ-మెయిల్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి