
ఇటీవల వెల్లడైన పలు నివేదికల ప్రకారం ఒక వ్యక్తి ఇంట్లో ఉంచుకోగల డబ్బు మొత్తంపై ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు. అయితే ఆ నగదు చట్టబద్ధమైన వనరుల నుంచి వచ్చి ఆదాయపు పన్ను దాఖలులో ప్రకటించాల్సి ఉంటుంది. అయితే అంత పెద్ద మొత్తంలో నగదుకు చెల్లుబాటు అయ్యే వివరణ ఇవ్వడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను అధికారులు డబ్బును స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉండటమే కాకుండా లెక్కకు రాని మొత్తంలో 137% వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. రసీదులు, బ్యాంక్ విత్ డ్రా స్లిప్లు, లావాదేవీ రికార్డులతో సహా అన్ని నగదు నిల్వలకు సరైన డాక్యుమెంటేషన్ను నిర్వహించడం చాలా ముఖ్యంగా.
నగదు లావాదేవీలకు నియంత్రణ ఇలా
వ్యాపారులు తమ నగదు నిల్వలను నమోదు చేసిన ఆర్థిక పుస్తకాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తులు కూడా తమ నగదు నిల్వలను సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తన్నారు. పన్ను చట్టాలు బహుమతులు స్వీకరించడం లేదా రూ. 2 లక్షలకు మించి నగదులో ఆస్తి లావాదేవీలు చేయడాన్ని నిషేధిస్తాయని పేర్కొంటున్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ప్రమేయం ఉన్న మొత్తానికి సమానమైన జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి