Budget 2024: బడ్జెట్లో పొదుపు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! అందరి చూపు.. నిర్మలమ్మ వైపే..

|

Jul 07, 2024 | 5:08 PM

పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. పొదుపు ఖాతా వడ్డీపై పన్ను మినహాయింపు పెంచనుందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Budget 2024: బడ్జెట్లో పొదుపు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! అందరి చూపు.. నిర్మలమ్మ వైపే..
Savings Account
Follow us on

సాధారణంగా ప్రతి ఒక్కరికీ పొదుపు ఖాతాలు ఉంటాయి. బ్యాంకులు, పోస్టాఫీసులలో వీటిని ప్రారంభిస్తారు. వీటిలో డబ్బులను పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఆ మొత్తాలపై బ్యాంకులు లేదా పోస్టాఫీసులు కొంత వడ్డీని కూడా అందజేస్తాయి. ఇలా వడ్డీ రూపంలో వచ్చే డబ్బులలో రూ.10 వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఈ మినహాయింపు లభిస్తుంది.

శుభవార్త చెబుతారా..

పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. పొదుపు ఖాతా వడ్డీపై పన్ను మినహాయింపు పెంచనుందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

వడ్డీ మినహాయింపు పెంపు?

పొదుపు ఖాతాలపై పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఆ శాఖలోని ముఖ్యమైన అధికారులతో గత వారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బ్యాంకులు ఈ విషయంలో సూచన చేశాయి. అయితే ఈ అంశం ఇంకా పరిశీలలోనే ఉంది. కొత్త నిబంధన అమలైతే బ్యాంకులకు కూడా మేలు కలుగుతుంది. పొదుపు ఖాతాలలో డిపాజిట్లు చేసేవారు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిమితి..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం పొదుపు ఖాతాల నుంచి ఏడాదికి వచ్చే వడ్డీలో రూ. 10 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. అలాగే 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఈ పరిమితి రూ.50 వేల వరకూ లభిస్తుంది. అయితే దీనిలో సెక్షన్80 టీటీబి కింద ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ)పై వచ్చే వడ్డీని కూడా కలుపుతారు. అలాగే పాత పన్ను విధానంలో మాత్రమే ఈ ప్రయోజనం కలుగుతుంది. కొత్త పన్ను విధానంలో వర్తించదు.

ఆర్బీఐ నివేదిక..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం.. చాలా కుటుంబాలు తమ ఆర్థిక పొదుపులను వైవిధ్యభరితంగా మారుస్తున్నాయని తెలిపింది. అంటే నాన్ బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్‌కు ఎక్కువగా కేటాయింపులు చేస్తున్నాయని గుర్తించింది. క్రెడిట్ డిపాజిట్ రేషియో మధ్య అంతరం పెరిగిపోతోంది. దీంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అందుకనే ఖాతాదారులను ఆకర్షించడానికి పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై మినహాయింపును పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొత్త విధానంలో ట్యాక్స్ బెనిఫిట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎంతో ప్రయోజనం..

పొదుపు ఖాతాల వడ్డీ మినహాయింపును పెంచితే ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో పాటు బ్యాంకులకూ కూడా ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారులతో పాటు అందరికీ ఏదో ఒక బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉంది. వాటిలో కొంత మేర డబ్బులను పొదుపు చేస్తారు. వాటిపై వడ్డీ రూపంలో కొంతమేర వారికి రాబడి వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న రూ.10 వేల మినహాయింపు బాగా తక్కువగా ఉందని చెబుతున్నారు. దాన్ని పెంచడం వల్ల ఖాతాలలో పొదుపు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే డిపాజిట్లు పెరగడం వల్ల బ్యాంకులకు కూడా ఆదాయం సమకూరుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..