AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు శుభవార్త..పంటలకు మద్ధతు ధర పెంపు..ఇవీ పెరిగిన ధరలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది..

రైతులకు శుభవార్త..పంటలకు మద్ధతు ధర పెంపు..ఇవీ పెరిగిన ధరలు
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2020 | 3:53 PM

Share

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం..పెంచిన ధరల వివ‌రాల‌ను ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.

పెరిగిన పంట ధర ప్రతి క్వింటాల్ కు….

1 . వరి – నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53)

2. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888

3. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-)

4. జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-)

5. సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-)

6. మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-)

7 . రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145)

8. కందులు పెంచిన ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-)

9. పెసలు పెంచిన ధర రూ.7196/-, (పెంచిన ధర రూ.146)

10. మినుములు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-)

11. వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-)

12 . ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-)

13. సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-)

14. నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-)

15. ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-)

16. ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-)

17. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)