
బంగారం కొనే వారకి గత కొద్ది రోజులుగా పసిడి ధరలు వరుస షాక్లు ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గత వారం రోజుల్లోనే పసిడి ధరలు భారీ పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఆగస్టు 15 నుండి ఆగస్టు 22 మధ్య దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3,500 నుండి రూ. 4,500 వరకు పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం కారణంగా బంగారం ధరల్లో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే నిన్నటితో పోల్చుకుంటే శనివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పు ఏమిలేదు.. ప్రస్తుతం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,490గా ఉండగా.. నిన్న ఈ ధర రూ. 1,60,480గా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,110 ఉండగా నిన్న ఈ ధర రూ1,47, 100గా ఉంది. ఇక 18 క్యారట్ల బంగార ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి సైతం బంగారం బాటలోనే నడుస్తోంది. దేశీయ మార్కెట్లో నిన్న కేజీ వెండి ధర రూ.2,60,000గా ఉన్న వెండి ధర రూ.100 పెరిగి ప్రస్తుతం 2,60,100 ట్రేడవుతుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. కాబట్టి మీరు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.