Gold Silver Price Today: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

తాజాగా.. పసిడి, వెండి ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించండి..

Gold Silver Price Today: మహిళలకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Updated on: May 26, 2022 | 6:30 AM

Latest Gold Silver Prices: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో కొన్ని రోజుల నుంచి తగ్గిన వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. పసిడి, వెండి ధరలు పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. బంగారం 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై 160 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.400 మేర పెరిగి.. రూ.62,000 లుగా ఉంది. బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370, 24 క్యారెట్ల ధర రూ.52,770 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.66,500 ఉంది. బెంగళూరులో రూ.66,500, కేరళలో రూ.66,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,500, విజయవాడలో రూ.66,500, విశాఖపట్నంలో రూ.66,500 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..