
Gold Price Today: రోజురోజుకు బంగారం, వెండి ధరలు. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఇప్పుడు కాస్త దిగి వస్తున్నాయి. లక్షా 30 వేలకుపైగా ఉన్న బంగారం ధర.. ప్రస్తుతం లక్షా 20 వేలకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా ధర ఎక్కువగానే ఉందంటున్నారు సామాన్యులు. తులం బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,900లకు చేరుకుంది. ఇది కూడా 2 లక్షల రూపాయలకు చేరువులో ఉండేది. ఇప్పుడు దిగి వస్తోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి