
Gold Price Today: బంగారం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల నుంచి కాస్త దిగి వస్తున్నాయి. ఇటీవల తులం బంగారం ధర ఏకంగా లక్షా 33 వేల వరకు వెళ్లళ్లగా, ప్రస్తుతం లక్షా 25 వేల వద్ద కదలాడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిన్న తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే పది రూపాయల మేరకు తగ్గింది. ఈ రోజు కూడా అదే ధరతో కొనసాగుతోంది. అక్టోబర్ 27న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,25,610 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గినా తర్వాత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి