
దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. తాజాగా ఫిబ్రవరి 19న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారంపై స్వల్పంగానే పెరిగినప్పటికీ ఇప్పటి వరకు భారీగానే పెరుగుతూ వస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,710 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత మరియు అమెరికన్ విధానాల కారణంగా, ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.
భారతదేశంలో బంగారం ధర వేర్వేరు నగరాల్లో మారుతూ ఉంటుంది. ఎందుకంటే దేశంలో బంగారం కోసం ఒకే రేటు ఇంకా నిర్ణయించలేదు. ఆయా ప్రాంతాల ట్యాక్స్ను బట్టి మార్పులు ఉంటాయని గుర్తించుకోండి. వివిధ రాష్ట్రాలు, నగరాల స్థానిక పన్నులు, ఆభరణాల తయారీ ఛార్జీలు కాకుండా, మరికొన్ని అంశాలు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా దక్షిణాది నగరమైన చెన్నైలో బంగారం ధరలు వేగంగా పెరుగుతాయి లేదా తగ్గుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి