Gold Price Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. తులం ఎంతకు చేరిందంటే..

|

May 23, 2024 | 6:27 AM

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్‌ దాటి దూసుకుపోయిన తులం బంగారం ధర మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రూ. 74 వేల మార్క్‌ దగ్గర కొనసాగుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు కాస్త శాంతించాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర..

Gold Price Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. తులం ఎంతకు చేరిందంటే..
Gold Price
Follow us on

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్‌ దాటి దూసుకుపోయిన తులం బంగారం ధర మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రూ. 74 వేల మార్క్‌ దగ్గర కొనసాగుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు కాస్త శాంతించాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,440గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 74,650 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,830 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,290కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రదేశాల్లో కిలో వెండి ధర ఇప్పటికే లక్ష దాటిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 95,900కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 100400కి ఎగబాకింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.