
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.81వేల మార్క్ దాటింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ హెచ్చులు, తగ్గులుంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు అనూహ్యంగా పడిపోతుంటాయి. తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం (20 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,510గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.81,240 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారాన్నే అనుసరిస్తున్నాయి. ప్రస్తుం కిలో వెండి ధర రూ.96,400 లుగా ఉంది. మొత్తానికి బంగారంపై రూ.10 మేర పెరగగా, వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..