Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?

|

May 18, 2024 | 6:24 AM

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఓరోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ప్రతీ రోజూ మార్పు కనిపిస్తోంది. నిన్న, మొన్న భారీగా పెరిగిన ధరలకు ఈరోజు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని అనుకుంటున్న తరుణంలో తాజాగా బంగారం ధరలు కాస్త శాంతించాయి...

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
Gold Price
Follow us on

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఓరోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ప్రతీ రోజూ మార్పు కనిపిస్తోంది. నిన్న, మొన్న భారీగా పెరిగిన ధరలకు ఈరోజు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని అనుకుంటున్న తరుణంలో తాజాగా బంగారం ధరలు కాస్త శాంతించాయి. మరి దేశ వ్యాప్తంగా శనివారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,890 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67590 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73740గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,740 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,740 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 73,740గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారంధర 67,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 73,740 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ. 89,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 89,000 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 92,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..