Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. కొందరు నగ రూపంలో కొంటే.. మరికొందరు ముడిసరుకు రూపంలో కొని దాచుకుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు స్వల్పంగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులే బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price

Updated on: Feb 08, 2024 | 6:08 AM

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. కొందరు నగ రూపంలో కొంటే.. మరికొందరు ముడిసరుకు రూపంలో కొని దాచుకుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు స్వల్పంగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,230 కాగా ఈరోజు తులంపై రూ.10 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,240 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు తులంపై రూ.10 పెరిగి రూ.58,010 కి చేరింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో వెండి రూ.76,000 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 తగ్గి 75,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 63,240
విజయవాడ..రూ. 63,240
ముంబాయి..రూ. 63,240
బెంగళూరు..రూ. 63,240
చెన్నై..రూ. 63,830

ఇవి కూడా చదవండి

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 58,010
విజయవాడ..రూ. 58,010
ముంబాయి..రూ. 58,010
బెంగళూరు..రూ. 58,010
చెన్నై..రూ.58,510

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 75,000
విజయవాడ..రూ. 75,000
చెన్నై..రూ. 75,000
ముంబాయి..రూ. 73,500
బెంగళూరు..రూ. 71,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..