
ఆర్థిక సంవత్సరం 2022-23నకు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి తుది గడువు సమీపిస్తోంది. ఇంకా కేవలం నాలుగు రోజు మాత్రమే సమయం ఉంది. జూలై 31తో గడువు ముగిసిపోతోంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా నాలుగో కోట్ల మంది ఐటీఆర్ ని ఫైల్ చేశారు. అందులో కేవలం 2.4 కోట్ల మంది ఐటీఆర్ లు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి. చాలా మంది పన్ను చెల్లింపు దారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిల్లో రీఫండ్ డిలే లేదా ఫెయిల్యూర్, రిస్ట్రిక్టిడ్ రీఫండ్ అని, నో ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ అని ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ లో చూపిస్తోంది. అలాంటి సందర్భంలో చాలా మంది టెన్షన్ పడిపోతున్నారు. అయితే ఐటీఆర్ రీఫండ్ ఫెయిల్యూర్ అయితే ఏమి చేయాలి? నిపుణులు చెబుతున్నది ఏంటి? తెలుసుకుందాం రండి.
సమాచారం తప్పుగా ఇవ్వడం.. పన్ను చెల్లింపుదారులు బ్యాంక్ ఖాతా నంబర్లు, పేర్లు లేదా చిరునామాలు వంటి వివరాలు కచ్చితమైనవి ఇవ్వాలి. అన్నింట్లోనూ ఒకే రకమైన ఇన్ఫో ఉండాలి. ఇవి తప్పుగా ఇస్తే రీఫండ్ క్రెడిట్ కావడంలో విఫలం కావచ్చు. ముఖ్యంగా పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిపోలాలి.
తప్పుగా ఫైల్ చేయడం.. పన్ను రిటర్న్లో తప్పులు, తప్పుడు లెక్కలు లేదా అసంపూర్ణ సమాచారం ఉంటే రీఫండ్ రాకపోవచ్చు.
అవుట్ స్టాండింగ్ డిమాండ్.. పన్ను చెల్లింపుదారు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటే, ఆదాయపు పన్ను డిమాండ్ను భర్తీ చేయడానికి ఈ రీఫండ్ ను ఉపయోగించవచ్చు.
ఒకవేళ మీ ఆదాయ పన్ను రీఫండ్ అవడం ఫెయిల్ అయితే ఈ విధం చేయండి..
ఐటీ వెబ్సైట్ ప్రకారం, పన్ను చెల్లింపుదారులు బహుళ బ్యాంక్ ఖాతాలను ముందుగా ధృవీకరించవచ్చు. ఆదాయపు పన్ను రీఫండ్ కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను నామినేట్ చేయవచ్చు.
కేవలం సేవింగ్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతా, ఎన్ఆర్ఓ ఖాతా, నగదు క్రెడిట్ ఖాతాలు మాత్రమే రీఫండ్ కోసం ముందుగా ధృవీకరించబడతాయి. ఈ ప్రయోజనం కోసం లోన్ లేదా పీపీఎఫ్ ఖాతాలను ముందుగా ధ్రువీకరించడం సాధ్యం కాదు.
ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియ స్వయంచాలకంగా ఉంటుంది. మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, అది మీ బ్యాంక్కి పంపబడుతుంది. మీ ఈ-ఫైలింగ్ ఖాతాలో ధ్రువీకరణ స్థితి 10-12 పని దినాలలో అప్ డేట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..