AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. లెక్కల్లోనే అసలు చిక్కు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతకు ఓ కలగా మారింది. చింత లేకుండా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చనే భావన అందరిలో ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. డీఏను మూడు శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. లెక్కల్లోనే అసలు చిక్కు
Da Hike
Nikhil
|

Updated on: Oct 22, 2024 | 3:44 PM

Share

దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం ఇటీవల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ని జూలై 1, 2024 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు) లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు వల్ల కేంద్ర ఖజానాకు దీని వల్ల రూ. 9,448 కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 4 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ప్రభుత్వం డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ని కూడా 4 శాతం పెంచింది.

జీతాల పెంపు లెక్క ఇదే 

ప్రభుత్వం 3 శాతం డీఏ పెంపును ప్రకటించినందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతాలు పెరిగే అవకాశం ఉంది? అనే విషయం ఇటీవల ప్రతి ఒక్కరూ వివిధ సైట్స్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఒక ఉద్యోగి జీతం నెలకు రూ. 30,000, మూల వేతనంగా రూ. 18,000 ఉంటే, అతను లేదా ఆమె ప్రస్తుతం రూ. 9,000 డియర్‌నెస్ అలవెన్స్‌గా పొందుతున్నారు. ఇది బేసిక్ పేలో 50 శాతం. అయితే, తాజా 3 శాతం పెంపు తర్వాత ఉద్యోగికి ఇప్పుడు నెలకు రూ.9,540 లభిస్తుంది. ఇది రూ.540 ఎక్కువ. కాబట్టి ఎవరైనా రూ. 18,000 ప్రాథమిక వేతనంతో నెలకు దాదాపు రూ. 30,000 జీతం కలిగి ఉంటే అతని లేదా ఆమె జీతం నెలకు రూ. 540 పెరుగుతుంది.

డీఏ పెంపు నిర్ణయం ఇలా

జూన్ 2022తో ముగిసే కాలానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌కు సంబంధించిన 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో అలవెన్సులను సవరిస్తుంది. అయితే ఈ నిర్ణయం సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించిన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత