
Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభమైంది. దీనికి విద్యుత్తు గానీ, డీజిల్ ఇంధనం గానీ అవసరం లేదు. ఈ రైలు కేవలం నీటితోనే నడుస్తుంది. ఇది చూడటానికి విభిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఈ అత్యాధునిక రైలు ఛార్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? కేవలం ఐదు రూపాయలు. నమ్మడం లేదా.. నిజమే.
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రతిరోజూ 356 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు ఉంటాయి. దీని తర్వాత, మరిన్ని ఇతర మార్గాల్లో కూడా రైళ్లను నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్తో నడిచే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి రైలు గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
హైడ్రోజన్ రైలు ఛార్జీలో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. కనీస ఛార్జీని కేవలం 5 రూపాయలు నిర్ణయించారు. గరిష్ట ఛార్జీ 25 రూపాయల వరకు ఉంటుంది. అంటే, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫారమ్ టిక్కెట్ కంటే హైడ్రోజన్ రైలు టిక్కెట్ చౌకగా ఉంది. ఈ రైలు టిక్కెట్లను IRCTC వెబ్సైట్ నుండి, రైల్వే కౌంటర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. జింద్ నుండి సోనిపత్ కు దూరం 89 కిలోమీటర్లు. జింద్ నుండి సోనిపత్ చేరుకోవడానికి కేవలం రెండు గంటల సమయం పడుతుంది.
ఇది కూడా చదవండి: Kitchen Hacks: ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియకపాయే.. ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు.. వైరల్ వీడియో!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి