
Bank Cheque Clear: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొత్త నిబంధనల ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో చెక్ క్లియరింగ్ ప్రక్రియ చాలా వేగవంతమైంది. చెక్కులను క్లియర్ చేయడానికి వినియోగదారులు ఇకపై పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల వల్ల ఈ ఇబ్బంది పూర్తిగా తొలగిపోయింది. హెచ్డిఎఫ్సి, ఐసిసి బ్యాంక్తో సహా అన్ని ప్రధాన బ్యాంకులు ఈ కొత్త వ్యవస్థను పూర్తిగా అమలు చేస్తున్నాయి.
నివేదికల ప్రకారం, ఆర్బిఐ కొత్త నిబంధనల కింద చెక్ క్లియరింగ్ ప్రక్రియ ఇప్పుడు ఒక్క రోజులోనే పూర్తవుతుంది. అంటే మీ చెక్ ఒక్క రోజులోనే క్లియర్ అవుతుంది. ఈ ప్రక్రియ రెండు ప్రధాన దశలుగా విభజించారు. మొదటగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కస్టమర్లు డిపాజిట్ చేసిన అన్ని చెక్కులను స్కాన్ చేసి, వాటిని క్లియరింగ్ హౌస్కు పంపుతాయి.
ఇది కూడా చదవండి: Silver Price: సిల్వర్ ప్రియులకు షాక్.. వెండి ధర భారీగా పెరగనుందా..?
ఈ ప్రక్రియ తర్వాత డబ్బులు తీసివేయాల్సిన బ్యాంకు సాయంత్రం 7 గంటలలోపు తమ నిర్ధారణను అందించాలి. అంతేకాకుండా ప్రతి చెక్కుకు వివరంగా ‘గడువు సమయం’ పేర్కొని ఉంటుంది. ఇది ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా చేస్తుంది.
రెండవ ప్రక్రియ విషయానికి వస్తే, బ్యాంక్ చెక్కులను మరింత భద్రపరచడానికి, ధృవీకరించడానికి పాజిటివ్ పే సిస్టమ్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. రూ.50,000 మించిన చెక్కుల కోసం ఖాతాదారులు ముందుగానే చెక్కు ఫోటోను బ్యాంకుకు అందించాలి. చెక్కులను క్లియర్ చేసేటప్పుడు బ్యాంకులు ఈ వివరాలను సరిపోల్చడానికి ప్రయత్నిస్తాయని గమనించడం ముఖ్యం. సమాచారం సరిగ్గా ఉంటే, చెల్లింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ప్రాసెస్ అవుతుందని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే..
బ్యాంకు వినియోగదారులందరికీ ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. దాని ప్రకారం.. మీరు చెక్కు జారీ చేసినప్పుడల్లా మీ బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉందని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. అలాగే, సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు చెక్కుపై అన్ని వివరాలను స్పష్టంగా, సరిగ్గా పూరించండి.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో జనరల్ బోగీలు ఎప్పుడూ ముందు, వెనుకే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి