సైబర్ దొంగలు సామాన్యుల ఖాతాల నుండి డబ్బు మాయమయ్యేలా చేయడానికి ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటారు. టెక్నాలజీని వాడుతూ జనాలను రకరకాలుగా మోసగిస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉంటే ఖాతాల్లో డబ్బులు మాయం కావడం ఖాయం. అందుకే సైబర్ నిపుణులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీ మొబైల్కు ఎలాంటి మెసేజ్లు గానీ, వాట్సాప్ మెసేజ్గానీ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో సామాన్యులు సులభంగా బాధితులుగా మారుతున్న అత్యంత ట్రెండింగ్ పద్ధతి ఏమిటంటే వ్యక్తి మొబైల్కు నకిలీ టెక్స్ట్ సందేశం పంపుతున్నారు. అందులో ఖాతాలో రూ. 15,000 జమ అయినట్లు సమాచారం. ఆ మెసేజ్తో లింక్ కూడా జోడిస్తారు. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఖాతా నుండి డబ్బు అదృశ్యమవుతుంది.
నిపుణులు ఈ రకమైన సంఘటనను ఫిషింగ్ దాడి అని పిలుస్తారు. మీ మొబైల్లో కూడా అలాంటి మెసేజ్ వచ్చిందంటే సైబర్ దొంగలు మిమ్మల్ని టార్గెట్ చేసినందున మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటి వరకు దీనిని నివారించినప్పటికీ, భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.
సైబర్ దొంగలు మీ మొబైల్కి పంపే టెక్స్ట్ సందేశాలు మీ బ్యాంక్ పంపిన సందేశాల మాదిరిగానే ఉంటాయి. అంటే మీరు హఠాత్తుగా ఆ మెసేజ్ని చదివితే, మీ ఖాతాకు ఎవరో డబ్బు పంపినట్లు మీరు కొన్ని క్షణాలపాటు నమ్ముతారు. ఆ తర్వాత మీ మొబైల్ అధికారిక యాప్లోకి వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే జీరో బ్యాలెన్స్ వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మొబైల్లో వచ్చిన మెసేజ్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయకుండా ఉండాల్సిందేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మీ మొబైల్కు వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేసినట్లయితే మీ బ్యాంకు వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంటాయి. దీంతో వారు మీ అకౌంట్ను ఖాళీ చేసేస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి