లండన్ బయల్దేరిన జగన్ దంపతులు

| Edited By:

Feb 20, 2019 | 11:55 AM

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి- భారతి దంపతులు లండన్ బయలుదేరారు. అక్కడి స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుతున్న కుమార్తె వర్షా రెడ్డిని చూసేందుకు వారు మంగళవారం రాత్రి బయల్దేరారు. అక్కడే ఆరు రోజులు గడపనున్న జగన్ దంపతులు ఈ నెల 26న తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే గత నెలలోనే జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు రావడం.. దానికి తోడు […]

లండన్ బయల్దేరిన జగన్ దంపతులు
Follow us on

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి- భారతి దంపతులు లండన్ బయలుదేరారు. అక్కడి స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుతున్న కుమార్తె వర్షా రెడ్డిని చూసేందుకు వారు మంగళవారం రాత్రి బయల్దేరారు. అక్కడే ఆరు రోజులు గడపనున్న జగన్ దంపతులు ఈ నెల 26న తిరుగు ప్రయాణం కానున్నారు.

అయితే గత నెలలోనే జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు రావడం.. దానికి తోడు కుమార్తెకు పరీక్షలు ఉండటంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాగా లండన్‌కు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ జగన్‌ పెట్టుకున్న పిటిషన్‌పై కోర్టు షరతులతో కూడిని అనుమతి ఇచ్చింది. లండన్‌లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్ ఫోన్, సెల్ నంబర్, ఈ- మెయిల్, ఫ్యాక్స్ నంబర్ తదితర వివరాలను కోర్టుతో పాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని షరతు పెట్టింది.