విశాఖలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

విశాఖ సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లిలో నాయుడుపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి
Follow us

|

Updated on: Jul 19, 2020 | 8:48 PM

విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దంపతులను బలి తీసుకుంది. విశాఖ సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లిలో నాయుడుపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పెందుర్తి మండలం జుతాడా, లంకెలపాలెం వైపు బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డుపై గొయ్యిని తప్పించబోయి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.