మహారాష్ట్ర లో కరోనా విజృంభణ

|

Jul 16, 2020 | 7:59 PM

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. గురువారం కరోనా బారిన పడి రికార్డు స్థాయిలో 266 మంది మృత్యువాతపడ్డారు. అటు ఇవాళ ఒక్కరోజే కొత్తగా 8,641 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది

మహారాష్ట్ర లో కరోనా విజృంభణ
Follow us on

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. గురువారం కరోనా బారిన పడి రికార్డు స్థాయిలో 266 మంది మృత్యువాతపడ్డారు. అటు ఇవాళ ఒక్కరోజే కొత్తగా 8,641 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,281కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,648కు చేరుకుంది. కరోనా మరణాలు కూడా మహారాష్ట్రను బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 266 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1,58,140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.