AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని నరేంద్ర మోదీ ‘ట్వీట్ల’ వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం “ఏప్రిల్-మే జాతీయ ఎన్నికలలో ఎక్కువమంది ఓటు హక్కును వినియోగించుకునేట్టుగా ప్రోత్సహించాలని” రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, విరాట్ కోహ్లీ, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్‍తో పాటు రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, పాత్రికేయులకు, చలనచిత్ర నటులకు ట్వీట్ చేశారు. చాలామంది యువకులు మిమ్మల్ని అభినందిస్తారు కాబట్టి వారికి ఈ విధంగా చెప్పాలి అని పేర్కొన్నారు. “అప్నా టైమ్ ఆ గయా హై మరియు మీ వద్ద ఉన్న ఒక ఓటింగ్ కేంద్రానికి […]

ప్రధాని నరేంద్ర మోదీ 'ట్వీట్ల' వర్షం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2019 | 5:19 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయం “ఏప్రిల్-మే జాతీయ ఎన్నికలలో ఎక్కువమంది ఓటు హక్కును వినియోగించుకునేట్టుగా ప్రోత్సహించాలని” రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, విరాట్ కోహ్లీ, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్‍తో పాటు రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, పాత్రికేయులకు, చలనచిత్ర నటులకు ట్వీట్ చేశారు. చాలామంది యువకులు మిమ్మల్ని అభినందిస్తారు కాబట్టి వారికి ఈ విధంగా చెప్పాలి అని పేర్కొన్నారు. “అప్నా టైమ్ ఆ గయా హై మరియు మీ వద్ద ఉన్న ఒక ఓటింగ్ కేంద్రానికి హై జోష్‍తో వెళ్ళండి” అని రణ్‍వీర్ సింగ్ మరియు విక్కీ కౌషల్‍కు పంపించిన ట్వీట్‍లో పేర్కొన్నారు.

మోదీ తన మొదటి 29 ట్వీట్లను ప్రత్యర్థులైన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేష్ యాదవ్, తేజాష్వి యాదవ్, ఎం.కె.స్టాలిన్‍కు జతచేశారు. అందులో రానున్న లోక్ స‌భ‌ ఎన్నికలలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని మోదీ పేర్కొన్నారు.

తన తదుపరి ట్వీట్లను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డిలకు పంపించారు.

“ప్రజల స్వరాన్ని వినిపించటానికి ఒక ఓటు గొప్ప మార్గం,” అని ప్రశంసిస్తూ ప్రముఖ గాయకురాలు లతా మంగేష్క‌ర్ మరియు స్వరకర్త ఎ.ఆర్.రహ్మాన్‍కు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

మాజీ క్రికెటర్లు కూడా ట్యాగ్ చేయబడ్డారు. ప్రజలను ప్రేరేపించడానికి ఇది తగిన సమయం, రికార్డు సంఖ్యలో ఓటు వేయడానికి సమయం ఆసన్నమైంది,” అని మోడి మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్ మరియు వీరేంద్ర సెహ్వాగ్‍లకు ట్యాగ్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని అత్యంత సామాజిక మీడియా రాజకీయ నాయకులలో ఒకరు…వీరికి 46.3 మిలియన్ల మంది ఫాలోవర్లు Twitter లో ఉన్నారు.