AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు భయాలతో అడవుల్లోకి పారిపోతున్న అక్కడి ఆదిమ తెగ..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దాటికి 54వేల మంది ప్రాణాలు కోల్పోగా.. పదిలక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కోదేశం ఒక్కోతీరును అవలంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధిస్తూ.. రోగులకు చికిత్స అందిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతో మంది ఆహారంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజగా మలేషియాలో ఓ తెగకు చెందిన […]

ఆ రెండు భయాలతో అడవుల్లోకి పారిపోతున్న అక్కడి ఆదిమ తెగ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 5:50 PM

Share

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దాటికి 54వేల మంది ప్రాణాలు కోల్పోగా.. పదిలక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కోదేశం ఒక్కోతీరును అవలంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధిస్తూ.. రోగులకు చికిత్స అందిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతో మంది ఆహారంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక తాజగా మలేషియాలో ఓ తెగకు చెందిన ప్రజలు కరోనా భయంలో గ్రామాలు విడిచి అడవుల్లోకి పారిపోతున్నారు. ఆ దేశంలోని “ఆరెంజ్ అస్లి” అనే ఆదిమ తెగ.. వారు నివసించే ఊర్లను వదిలేసి సమీప అభయారణ్యాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఇక్కడ తమకి ఆహారం ఎలా సంపాదించుకోవాలో తెలుసని చెబుతున్నారట ఆ దేశంలోని జమేరీ అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.

ఈ తెగకు చెందిన వారు కడుపేదరికంలో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..వీరిలో పోషకాహారలోపం ఎక్కువ. ఈ క్రమంలో వైరస్‌ ప్రభావం ఇలాంటి వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కూరగాయలు, పండ్లు అమ్ముకుంటే వారు జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయమే వీరికి జీవనాధారం. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో ఆ ఆదాయం కూడా తగ్గిపోవడంతో.. ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అడవుల్లోకి వెళ్లడమే బెటర్‌ అనుకుని వెళ్లిపోయారు. అయితే మరికొంతమంది మాత్రం ఆహారం కోసం అడవుల్లోకి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారట. ఆ గ్రామానికి చెందిన ఓ పెద్దాయన.. ప్రస్తుతం కరోనా తమ బతులకుల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించిందని.. ఈ వైరస్‌ వచ్చినా తమ ప్రాణాలను తీస్తుందని.. ఇలానే ఉంటే ఆకలి కూడా తమ ప్రాణాలను తీస్తుందని వాపోయారట. మొత్తానికి మలేషియాలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని అర్ధమవుతోంది.

Follow Us
RCB vs SRH Live Score: తొలి పోరుకు అంతా సిద్ధం..
RCB vs SRH Live Score: తొలి పోరుకు అంతా సిద్ధం..
కరుంగళి మాలను ఎవరు ధరించాలి? సంపద, అదృష్టం రహస్యాలు తెలుసుకోండి!
కరుంగళి మాలను ఎవరు ధరించాలి? సంపద, అదృష్టం రహస్యాలు తెలుసుకోండి!
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ