“మహా”లో కరోనా విలయ తాండవం.. మూడు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

| Edited By:

Jul 18, 2020 | 10:34 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే..

మహాలో కరోనా విలయ తాండవం.. మూడు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. దేశం వ్యాప్తంగా పది లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం నాటికి మహారాష్ట్రలో మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 8,348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,937కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 144 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,596కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,65,663 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానే నగరాల్లో నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని మహరాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.