నేతన్నల ఉపాధి దిశగా కె.టి.ఆర్ చర్యలు

| Edited By:

Feb 21, 2019 | 4:30 PM

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 3058 మంది నిరుపేదలకు నివాస స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండవద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్నమని, దానిని సాకారం చేసేందుకే రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ఈ ఏడాది సిరిసిల్లకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల ప్రస్తావన వచ్చిందని […]

నేతన్నల ఉపాధి దిశగా కె.టి.ఆర్ చర్యలు
Follow us on

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 3058 మంది నిరుపేదలకు నివాస స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండవద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్నమని, దానిని సాకారం చేసేందుకే రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ఈ ఏడాది సిరిసిల్లకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల ప్రస్తావన వచ్చిందని ఆ సందర్భంగా గతేడాది ఇచ్చిన చీరల డిజైన్లకంటే మరింత ఆకర్షణీయంగా ఈ సారి ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ చెప్పారన్నారు. ఇందుకోసం ప్రస్తుతం కేటాయించిన నిధులకంటే అదనంగా రూ.20కోట్లు కేటాయించినా ఫర్వాలేదన్నారని తెలిపారు.

ఇటీవల పంపిణీ చేసిన బతుకమ్మ చీరలతో సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యం రాష్ట్రం నలుమూలలకు చేరిందన్నారు. కార్మికులకు వస్త్రోత్పత్తిలో, మహిళలకు అపెరల్‌ పార్కులో ఉపాధి లభించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలోని ఒక్కో కార్మికుని కుటుంబంలో నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల స్థిరమైన ఆదాయం లభించేలా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.