దుబాయ్​ చేరుకున్న‌ పాంటింగ్, ఆరు రోజులు క్వారంటైన్​

|

Aug 27, 2020 | 5:28 PM

ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్ప‌టికే జట్లన్నీ అక్క‌డికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న‌ ఆరు రోజుల క్వారంటైన్​ నేటితో కంప్లీట్ అవ్వ‌నుంది.

దుబాయ్​ చేరుకున్న‌ పాంటింగ్, ఆరు రోజులు క్వారంటైన్​
Follow us on

ఐపీఎల్ కోసం యూఏఈ ముస్తాభవుతోంది. ఇప్ప‌టికే జట్లన్నీ అక్క‌డికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న‌ ఆరు రోజుల క్వారంటైన్​ నేటితో కంప్లీట్ అవ్వ‌నుంది. దీంతో ప్రాక్టీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆదివారమే దుబాయ్ చేరుకుంది. తాజాగా ఆ జ‌ట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా ద్వారా అతడికి స్వాగతం తెలిపింది.

ఈ ఆరు రోజుల్లో ఆటగాళ్లకు మూడుసార్లు క‌రోనా టెస్టులు చేయనున్నారు. ఈ పరీక్షల్లో నెగటివ్​ వచ్చిన వారినే బయో బబుల్​లోకి అనుమ‌తిస్తారు. తాజాగా దుబాయ్ చేరిన పాంటింగ్ కూడా ఆరు రోజులు క్వారంటైన్​లో ఉండనున్నాడు. తాను హోటల్​లో అడుగుపెట్టిన అనంత‌రం తీసిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు పాంటింగ్.