ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ గొడవ సీనియర్స్, జూనియర్స్ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా కేంద్రం పానగల్లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బాలుర హాస్టల్లో ఆదివారం ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలు జూనియర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో దాడికి పాల్పడిన 10 మంది సీనియర్ విద్యార్థులను 15రోజుల పాటు హాస్టల్ నుంచి, ముగ్గురు జూనియర్లను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు.