AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల రక్షణ ఉన్నా.. ఆశ వర్కర్లకు తప్పని సర్వే కష్టాలు..

ఆశ వర్కర్లకు ఇంటింటి సర్వే కష్టాలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఢిల్లీ మర్కజ్ మీటింగ్‌లకు వెళ్లి వచ్చిన వారి వివరాలతో పాటు.. వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారన్న దాని గురించి వివరాలు సేకరిస్తున్నారు ఆశ వర్కర్లు. ఈ క్రమంలో ఓ వర్గం నేతలు ఆశ వర్కర్లకు సహకరించడం లేదు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. నిర్మల్‌లో ఆశ వర్కర్లకు రక్షణగా పోలీసులు కూడా ఉన్నారు. అయినా కూడా వారి […]

పోలీసుల రక్షణ ఉన్నా.. ఆశ వర్కర్లకు తప్పని సర్వే కష్టాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 2:22 PM

Share

ఆశ వర్కర్లకు ఇంటింటి సర్వే కష్టాలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఢిల్లీ మర్కజ్ మీటింగ్‌లకు వెళ్లి వచ్చిన వారి వివరాలతో పాటు.. వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారన్న దాని గురించి వివరాలు సేకరిస్తున్నారు ఆశ వర్కర్లు. ఈ క్రమంలో ఓ వర్గం నేతలు ఆశ వర్కర్లకు సహకరించడం లేదు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. నిర్మల్‌లో ఆశ వర్కర్లకు రక్షణగా పోలీసులు కూడా ఉన్నారు. అయినా కూడా వారి తీరులో ఏ మాత్రం మార్పు లేదు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కాబూతర్ కాలనీకి చెందిన కమాన్ కౌన్సిలర్ జహీర్.. తన వివరాలు ఇచ్చేది లేదంటూ ఆశ వర్కర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కౌన్సిలర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆశ వర్కర్లకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని పోలీసులు కూడా కోరినా.. లేదని మాటల యుద్ధానికి దిగారు సదరు కౌన్సిలర్. ఇటీవల మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మంది కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం వారందరికి చికిత్స అందించేందుకు వివరాలను సేకరిస్తోంది.