సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. విజయవాడ నుంచి ఎల్లుండి (23వ తేదీ) సాయంత్రం గం.3.50 కు రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు వెళతారు. సాయంత్రం గం. 6.20 నిమిషాలకు గరుడవాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం గం. 8.10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమిపూజలో జగన్ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం గం.11.30 కు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్.