Breaking: హైదరాబాద్ నుంచి రానున్న ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్..!
రేపటి నుంచి హైదరాబాద్ టు ఏపీకి వెళ్లాల్సిన బస్సులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు, మూడు రోజులు ఈ సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రేపటి నుంచి హైదరాబాద్ టు ఏపీకి వెళ్లాల్సిన బస్సులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు, మూడు రోజులు ఈ సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకు వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సులను నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పందన సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా సూచించింది. ఈ క్రమంలో మొదట 13వేల మందిని రాష్ట్రానికి తీసుకురావాలనుకున్నారు. అయితే సాంకేతిక కారణాల వలన ఈ సర్వీసులు నడపడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. రెండు, మూడు రోజుల్లో బస్సులు తిరుగుతాయని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
Read This Story Also: కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్: ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ ఎప్పుడంటే..!