
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం అనేది కామన్. అయితే ఈ సారి అనుకోని విధంగా, వందేళ్ల తర్వాత మిథున రాశిలో బృహస్పతి, చంద్రగ్రహాల కలయిక జరగబోతుంది. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది, ప్రతి పనిలోనూ విజయం సొంతం కానుంది. కాగా, ఏ రాశుల వారిని అదృష్టం వరిస్తుందో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : గజకేసరి రాజయోగం వలన వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్ కోసం చూస్తున్నారో, వారికి త్వరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

మిథున రాశి : మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం వలన ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే గౌరవం పెరిగి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

తుల రాశి : గజకేసరి రాజయోగం వలన తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రతి పనిలోని విజయం వరిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు కలిసి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరు ఎంత కష్టతరమైన పనులైనా సరే చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు, పట్టిందల్లా బంగారమే కానున్నదంట.