Sajjala: షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదు : సజ్జల

|

Jul 08, 2021 | 9:56 PM

తెలంగాణతో ఏపీ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని.. అందుకే ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే..

Sajjala: షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదు : సజ్జల
Sajjala Ramakrishna Reddy
Follow us on

Sajjala – Sharmila: తెలంగాణతో ఏపీ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని.. అందుకే ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే అక్కడ వైసీపీని విస్తరించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో పెట్టిన పొలిటికల్ పార్టీపై స్పందించాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీలైనంత వరకు తెలంగాణ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నది తమ వైఖరి అని అన్నారు.

షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న పార్టీ గతంలో ఆమె ప్రకటించిన మేరకే జరుగుతోందని, ఇందులో తాము మాట్లాడాల్సిందేమీలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తాము రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తే అవి ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఏపీలో తప్ప ఇంకెక్కడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని స్థిర అభిప్రాయంతో ఉన్నారని సజ్జల వివరణ ఇచ్చారు.

Read also: Jagadish Reddy: ఏపీ సీఎం అసత్యాలు, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు : మంత్రి జగదీశ్‌రెడ్డి