YCP Kapu Leaders: జనసేనానికి వైసీపీ కాపు నేతలు స్ట్రాంగ్ కౌంటర్.. త్వరలో మరోసారి విజయవాడలో సమావేశం..

|

Nov 01, 2022 | 11:15 AM

ఆంధ్రప్రదేశ్ లో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది సమావేశం.

YCP Kapu Leaders: జనసేనానికి వైసీపీ కాపు నేతలు స్ట్రాంగ్ కౌంటర్.. త్వరలో మరోసారి విజయవాడలో సమావేశం..
YCP Kapu Leaders vs janasena
Follow us on

2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించబోతోంది. రాజమండ్రిలో భేటీ అయిన కాపు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా చర్చించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది సమావేశం.

టీడీపీ హయాంలో, ఇప్పుడు కాపుల పరిస్థితి, వారికి అందిన, అందుతున్న పథకాలపై చర్చించారు నేతలు. 2014 నుంచి 2019 వరకు రెండు లక్షల 54 వేల మంది కాపులకు 1824 కోట్ల సాయం అందితే, ఈ మూడున్నరేళ్లలో 70 లక్షల 83 వేల మందికి 26 వేల 490 కోట్ల లబ్ది చేకూరిందని వివరించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

మరోవైపు ఇటీవల వైసీపీలోని కాపు నేతలపై, రంగా హత్యపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబును కలవడంపైనా సమావేశంలో చర్చించారు. చంద్రబాబు కోసమే జనసేన అధ్యక్షుడు పని చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. జనసేన సెలబ్రిటీ పార్టీ అని, చంద్రబాబు కోసం పని చేయకపోతే పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా అని ప్రశ్నించారు బొత్స. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కోసమే పని చేస్తున్నారని తాము ముందు నుంచి చెబుతున్నదే నిజమైందన్నారు మంత్రి అంబటి రాంబాబు.

ఈ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చింది జనసేన. వైసీపీ నుంచి కాపుల్లో ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ఉందా అని ఆ పార్టీని ప్రశ్నించారు జనసేన నేత కందుల దుర్గేష్‌. మరోవైపు కాపుల అంశంపై చర్చించేందుకు త్వరలోనే విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు వైసీపీ నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..