
ప్రకాశం జిల్లా పొదిలి నవాబ్ మిట్ట పాఠశాల సమీపంలో కొండచిలువ కలకలం రేపింది. కొండచిలువను చూసిన స్థానికులు, పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం 8 అడుగుల పొడవున్న కొండచిలువను ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత దాన్ని దూరంలో ఉన్న అడవిలో వదిలేవారు అటవీశాఖ సిబ్బంది.