AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగుబోతు వీరంగం..మద్యం మత్తులో దారుణం

కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహితపై తాగుబోతు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో జరిగింది.

తాగుబోతు వీరంగం..మద్యం మత్తులో దారుణం
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2020 | 5:39 PM

Share

కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహితపై తాగుబోతు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

లక్ష్మయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగుతూ గ్రామంలో గొడవలు సృష్టించేవాడు. ఈ నేపథ్యంలోనే తాగిన మైకంలో తన కోరిక తీర్చాలని ఓ వివాహితను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. మహిళకు తీవ్రగాయాలు కావడంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సున్నిపెంట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.