AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు

విశాఖపట్టణంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ

యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 05, 2020 | 12:09 PM

Share

UPSC Exam Visakhapatnam: విశాఖపట్టణంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ పరీక్షల కోసం అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఈ రైలును నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠీ వెల్లడించారు. ఇక ఈ ప్రత్యేక రైలు ఇచ్ఛాపురం–విశాఖ–ఇచ్ఛాపురం నడవనున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖకు 05831 నంబరుతో, తిరుగు ప్రయాణంలో 05832 నంబరుతో ఈ ప్రత్యేక రైలు నడవనుంది. ఇక ఈ రైలులో ప్రయాణించే అభ్యర్థులు కచ్చితంగా అడ్మిట్‌ కార్డ్‌ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.స్టేషన్ల బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఈ రైలుకు సంబంధించిన టికెట్లు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

Read More:

ఈ కరోనా వైరస్ మరో ఏడాది కూడా , ఎయిమ్స్ చీఫ్

లోయలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి