యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక రైలు
విశాఖపట్టణంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ
UPSC Exam Visakhapatnam: విశాఖపట్టణంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షల కోసం అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ రైలును నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠీ వెల్లడించారు. ఇక ఈ ప్రత్యేక రైలు ఇచ్ఛాపురం–విశాఖ–ఇచ్ఛాపురం నడవనున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖకు 05831 నంబరుతో, తిరుగు ప్రయాణంలో 05832 నంబరుతో ఈ ప్రత్యేక రైలు నడవనుంది. ఇక ఈ రైలులో ప్రయాణించే అభ్యర్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డ్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.స్టేషన్ల బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ రైలుకు సంబంధించిన టికెట్లు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
Read More:
ఈ కరోనా వైరస్ మరో ఏడాది కూడా , ఎయిమ్స్ చీఫ్