ఈ కరోనా వైరస్ మరో ఏడాది కూడా , ఎయిమ్స్ చీఫ్
ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే కరోనా వైరస్ వచ్ఛే ఏడాది కూడా కొనసాగే సూచనలున్నాయని ఢిల్లీ లోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్-19 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఈయన సభ్యుడు కూడా..
ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే కరోనా వైరస్ వచ్ఛే ఏడాది కూడా కొనసాగే సూచనలున్నాయని ఢిల్లీ లోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్-19 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో ఈయన సభ్యుడు కూడా.. ఈ వైరస్ పూర్తిగా అంతరించిపోయేందుకు మరికొంతకాలం పడుతుందని ఆయన చెప్పారు. ఇది దేశంలో చిన్న నగరాలకు, గ్రామాలకు కూడా విస్తరిస్తోందని, జనాభా ఎక్కువ కావడం కూడా దీని వ్యాప్తికి కారణమని ఆయన అన్నారు. మొత్తానికి సెకండ్ వేవ్ తప్పదన్న రీతిలో ఆయన మాట్లాడారు. దేశంలొ ఇప్పుడు ముఖ్యంగా మూడు రకాల వ్యాక్సీన్లు డెవలప్ అవుతున్నాయని, అన్నీ అనుకూలిస్తే ఈ సంవత్సరాంతానికి ఇవి అందుబాటులోకి రావచ్ఛునని అన్నారు.
రష్యాలో వ్యాక్సీన్ ట్రయల్స్ ను కొద్ది మంది వాలంటీర్లపైనే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.