Bharath Bandh: భారత్‌ బంద్‌ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. విజయవాడలో భారీ బందోబస్తు..

Bharath Bandh: అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే..

Bharath Bandh: భారత్‌ బంద్‌ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. విజయవాడలో భారీ బందోబస్తు..

Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 10:09 AM

Bharath Bandh: అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలోని కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీసు అదనపు బలగాలు మోహరించారు.

భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చిరికలు జారీ చేశారు. రైల్వేస్టేషన్ వద్ద అన్ని వైపులా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, సున్నిత ప్రదేశాలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆక్టోపస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలతో భారీ బందోబస్లు ఏర్పాటు చేశారు. విజయవాడ బస్టాండ్‌, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న నిరసనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..