
సామాన్యులకు కూరగాయల ధరలు ఊరట కలిగించాయి. మార్కెట్లో టమాట, వంకాయ ధరలు తగ్గాయి. రైతు మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు బెండకాయ, పచ్చిమిర్చి ధరల్లో మాత్రమే పెరుగుదల నమోదైంది. టమాట, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా పడిపోతూ వస్తోన్నాయి. టమాట ధరలు అయితే ఆమాంతం తగ్గిపోయాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే లభిస్తుండగా.. ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
కూకట్ పల్లిలోని రైతు బజార్లో కిలో టమాట రూ.11, వంకాయ రూ.18, బెండకాయ రూ.35 పచ్చిమిర్చి రూ.45, బజ్జిమిర్చి రూ.18, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.12, బీన్స్ రూ.40 పలుకుతోంది. క్యారెట్ రూ.18, గోబి పువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడు కాయ రూ.35, గోరు చిక్కుడు రూ.28, బీట్రూట్ రూ.18, క్యాప్సికం రూ.44, ఆలుగడ్డ రూ.18, కీర రూ.18గా కొనసాగుతోంది. దోసకాయ రూ.13, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.18కి విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ రూ.20, చిలగడ దుంప రూ.25కి అమ్ముతున్నారు.
విజయవాడలో కిలో టమాట రూ.13, వంగ రూ.19, బెండకాయ రూ.19, పచ్చిమిర్చి రూ.24, కాకరకాయ రూ.18, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.26, దొండకాయ రూ.25, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయ రూ.22, గోరుచిక్కుడు రూ.22, దోసకాయ రూ.18, సొరకాయ రూ.11, చిక్కుళ్లు రూ.24, బీరకాయ రూ.22, చామదుంప రూ.26, బీట్ రూట్ రూ.24, కీరదోస రూ.36, బీన్స్ రూ.70, క్యాప్చికమ్ రూ.56, అలసందలు రూ.24, చిలకడదుంప రూ.24కి రైతు బజార్లలో విక్రయిస్తున్నారు.
ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్లో కిలో టమాట రూ.11, వంట రూ.16, బెండకాయ రూ.25, పచ్చిమిర్చి రూ.26, కాకరకాయ రూ.30, క్యారెట్ రూ.27, క్యాబేజీ రూ.17, బీరకాయ రూ.30, దొండకాయ రూ.27, బంగాళదుంప రూ.30, ఉల్లిపాయలు రూ.22, గొరుచిక్కుడు రూ.24, దోసకాయ రూ.17, పొట్లకాయ రూ.24. చామదుంప రూ.25, క్యాప్చికం రూ.50, సొరకాయ రూ.10, బీన్స్ రూ.75, కీర రూ.39, బీట్ రూట్ రూ.25కి అమ్ముతున్నారు.