Tirumala: తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు

|

Oct 06, 2024 | 2:20 PM

తిరుమలకు చేరుకునే నడక మార్గంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆ మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ సమీపంలో మృతదేహాం, ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది.

Tirumala: తిరుమల నడక మార్గంలో కలకలం.. పక్కపక్కనే మనిషి, జింక కళేబరాలు
Tirumala Walkway
Follow us on

తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తుతెలియని వ్యక్తి  అధికారులు గుర్తించారు. . అలిపిరి మార్గంలోని నరసింహ స్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తూ ఉండటంతో.. స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతక్క.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మనిషి డెడ్‌బాడీ పక్కనే.. ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్‌గా మారింది. ఘటనా స్థలంలో నాలుగు జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి.

ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? లేదా వన్యమృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది. పక్కనే జింక కళేబరం కూడా ఉండటంతో.. ఆ దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు. ఆ నాలుగు జతల చెప్పులు కూడా క్లారిటీ రావాల్సి ఉంది.  ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, మృతదేహం ఉన్న స్థితిని బట్టి వారం కంటే ముందే ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి