తిరుపతి ఉప ఎన్నిక: జోరందుకున్న ప్రచారం.. రంగంలోకి సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 14న రోడ్ షో.!

Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు..

తిరుపతి ఉప ఎన్నిక: జోరందుకున్న ప్రచారం.. రంగంలోకి సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 14న రోడ్ షో.!
Jagan

Updated on: Apr 07, 2021 | 12:36 PM

Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు కోసం ఆయన ఈ నెల 14వ తేదీన ప్రచారం చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంట్ సీట్‌ను అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలన్న టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఫైనల్ టచ్ ఇస్తే.. పార్టీకి మరింత సానుకూలత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనితో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. పార్టీ అభ్యర్ధి తరపున ఏప్రిల్ 14వ తేదీన ప్రచారం చేయబోతున్నారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!