Tirumala Tirupati Devasthanams: తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికై మార్చి నెల టికెట్లు విడుదల చేసిన టీటీడీ..

|

Feb 21, 2021 | 9:24 AM

Tirumala Tirupati Temple: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే..

Tirumala Tirupati Devasthanams: తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికై మార్చి నెల టికెట్లు విడుదల చేసిన టీటీడీ..
Follow us on

Tirumala Tirupati Temple: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. భక్తులు ఈ టికెట్లను ఆన్‌‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. కాగా, ఈ టికెట్లు tirupatibalaji. ap. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టికెట్లతో పాటు తిరుమలలో గదుల కోటాను కూడా ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. కాగా, లాక్‌డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Also read:

Bird Flu: షాకింగ్‌ న్యూస్‌.. మనుషులకూ బర్డ్‌ ఫ్లూ.. మొదటి కేసు గుర్తించిన వైద్య నిపుణులు.. ఎక్కడంటే..

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..