Rare fish in srikakulam: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలాసార్లు మత్సకారులకు అరుదైన చేపలు చిక్కాయి. కానీ వింత చేపలు దొరికిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..? లేదు కదా. ఇప్పుడు అలాంటి వింత చేపను చూపించబోతున్నాం. విచిత్రమేమిటంటే ఈ చేప పేరు కూడా స్థానిక మత్సకారులకు తెలియదట. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం కొత్త అమరాంకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆదివారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అతడికి ఈ వింత చేప చిక్కింది.
చూడటానికి పాములా.. ఒంటిపై నల్లటి చారలు ఉన్నాయి. ఇలాంటి అరుదైన చేపను ఇప్పటి వరకు చూడలేదని, దీనిపేరు కూడా తమకు తెలియదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. కాస్త వింతగా ఉండటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ చేపను ఆసక్తిగా చూశారు. స్థానిక చెరువులో ఈ అరుదైన చేప దొరకడం వారికి ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో కురిసిన వర్షాల సమయంలో.. ఈ చేప చెరువులోకి చేరి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:
Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!