తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో… పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన స్థలానికి చేరుకుని భారీ సైజు తో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు సంచరించే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.
ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల నుంచి భక్తులను రక్షిస్తున్నాడు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పటి వరకు 10వేలకు పై చిలుకు పాములను రెస్క్యూ చేశాడు. రిటైరైనా ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తున్నారు. అయితే 2022లో ఎస్వీ యూనివర్సిటీలో పామును పడుతుండగా దురదృష్టవశాత్తు గ్లౌజ్ ఊడిపోవడంతో భాస్కర్ నాయుడిని పాము కాటేసింది. చాలా డేంజర్లోకి వెళ్లి… తిరిగి కోలుకున్నాడు. తిరుమలలో ఎంత పెద్ద పాము అయినా.. ప్రమాదకర పాము అయినా సరే చిటికెలో పట్టెస్తాడు భాస్కర్ నాయుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పామును అవలీలగా చేజిక్కించుకుంటాడు. తిరుమల, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారు ఉండరు. పాము కనిపిస్తే చాలు.. ఆయనకు కాల్ చేస్తారు స్థానికులు. ఫోన్ చేసి పాము కనిపించింది చెప్పడమే ఆలస్యం.. పది నిమిషాల్లో అక్కడ వాలిపోయి చాకచక్యంగా పామును తన చేతులతో బంధిస్తాడు భాస్కర్ నాయుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..