Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..

|

Feb 13, 2022 | 5:49 AM

South Central Railway: రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.

Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..
Trains
Follow us on

South Central Railway: రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లను పాక్షికంగా (Trains Cancelled) రద్దు చేసినట్లు వెల్లడించింది. చెన్నై – గూడురు సెక్షన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు – సూళ్లూరుపేట, సూళ్లూరుపేట – నెల్లూరు మధ్య నడిచే మెమూ రైళ్లను (06746 – 06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా.. విజయవాడ – చెన్నై సెంట్రల్‌ చెన్నై సెంట్రల్‌ – విజయవాడ (12711 – 12712) రైళ్లను ఈ నెల 22న గూడూర్-చెన్నై సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్‌ – తాంబరం (12760) మధ్య నడిచే రైలును ఈ నెల 26న చెన్నైబీచ్‌–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు.. 

∙ పుదుచ్చేరి – న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ – ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారిమళ్లింపు.

∙ ఇండోర్‌ – కొచువేలి ఎక్స్‌ప్రెస్‌ (22645) – ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్‌ మీదుగా మళ్లింపు.

∙ ధన్‌బాద్‌ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ (13351) – ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారిమళ్లింపు.

∙ కాకినాడ – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17644) – ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.

∙ కాకినాడ – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17652) – ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.

∙ చెన్నై ఎగ్మోర్‌ – ముంబై సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్‌ (22158) – ఈ నెల 27న తాంబరం, చెంగల్‌పట్టు మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Also Read:

Assam CM On CM KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్.. ఏమన్నారంటే..?

Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్