AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Science vs Superstition: సైన్స్ vs మూఢ నమ్మకాల మధ్య నలిగిపోతున్న పల్లెలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో వయసొచ్చిన ఇద్దరు ఆడపిల్లల్ని తల్లిదండ్రులే చంపేశారు. కారణం.. దేవుడు, దెయ్యం. ఎవడో కోయదొర చెప్పాడని భార్య ఆరోగ్యం కోసం పసికందును నరబలి ఇచ్చాడో భర్త. కొమురంభీమ్‌ జిల్లాలో భార్యపై మంత్రాలు ప్రయోగించాడని సొంత తమ్ముడినే కర్రలతో కొట్టి చంపేశాడు ఓ అన్న. మూఢనమ్మకాలు చేసే అనర్థాలు ఇవన్నీ. అలాగని, ప్రతీదీ మూఢనమ్మకమే అని కొట్టిపారేస్తే.. పుక్కిటి పురాణాలంటూ అన్నిటినీ తిరస్కరిస్తే.. అది అశాస్త్రీయమే కాదు బాధ్యతారాహిత్యం కూడా. కాకపోతే.. తురకపాలెంలో మరణాలకు, బొడ్రాయికి మధ్య లింక్‌ను ఎలా చూడాలన్న ప్రశ్న వినిపిస్తోంది. అభిషేకాలు చేయగానే మరణాలు ఆగాయంటున్నారు ఊరి ప్రజలు. ఇక్కడ సైన్స్‌ను నమ్మాలా, ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాలా? ఆ రెండింటి మధ్యనున్న చిన్న గీతను ఎలా చూడాలి?

Science vs Superstition: సైన్స్ vs మూఢ నమ్మకాల మధ్య నలిగిపోతున్న పల్లెలు
Science Vs Superstition
Ram Naramaneni
|

Updated on: Sep 15, 2025 | 9:35 PM

Share

తూనీగలు ఒక్కసారిగా గాల్లోకి లేస్తే వాన రాబోతోందని అర్థం. తంగేడు పూలు విరగబూస్తే వర్షాలు ఎక్కువ ఉంటాయని నమ్మకం. గ్రహణం రోజు పక్షుల అరుపులు ఒక సంకేతం. సునామీకి ముందు పక్షుల అరుపులతో మేల్కొన్న జంతుజాలం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాయన్నది నిజం. దాన్ని ప్రకృతి ప్రసాదించిన దివ్యత్వంగా చూడాలా, అందులో సైన్స్‌ లేదు కదా అని నమ్మకుండా ఉండాలా?  మహా అయితే 3వేల జనాభా! 5 నెలల్లో 30 మంది మృత్యువాత! మరిప్పుడేంటి… పరిస్థితి?  శివయ్య వచ్చాడు. గుమ్మం ముందు నిలబడి ఇంకేం భయం లేదన్నాడు. మరణాలు ఆగింది అందుకేనన్నది ఊరి జనం విశ్వాసం. అటు పోలేరమ్మ కూడా పలికింది. జలాభిషేకం చేయండి, శాంతిస్తానని చెప్పింది. అలా చేసినందుకే చావులు ఆగాయన్నది స్థానికుల విశ్వాసం. నిన్నమొన్నటి దాకా పరిస్థితి వేరు! తురకపాలెం జనానికి బొడ్రాయి శాపం! వైద్యులు చెబుతున్నది మాత్రం.. వ్యాధి కారణం!. ఏప్రిల్‌లో ఇద్దరు. మే నెలలో ముగ్గురు. జూన్‌లో ఇద్దరు, జులైలో 10 మంది, ఆగస్ట్‌లో మరో 10 మంది. ఒకరి దశ దిన కర్మలు పూర్తయ్యేలోపు మరొకరి చావు. గుంటూరు రూరల్‌లోని తురకపాలెంలో ఐదు నెలలుగా ఇదే సీన్. బయటకు రావడానికే భయపడేంత పరిస్థితి. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లారో.. ఇక వాళ్లు తిరిగొచ్చేది శవంగానే అనే భయం. దీనంతటికీ తురకపాలెం గ్రామస్తులు చెబుతున్న కారణం… బొడ్రాయి శాపం. కొన్నాళ్ల క్రితం బొడ్రాయితో పాటు నాలుగు దిక్కులు గవిటి రాయి ప్రతిష్టించారు. వాటిలో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి