పీజీ వైద్య విద్యకు నూతన ఫీజల విధానాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీంతో కాలేజీల వారీగా ఫీజులు నిర్ణయించనుంది జగన్ సర్కార్. 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ కాలేజీల్లో ఒకే తరహా ఫీజుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది అప్పటి ప్రభుత్వం. వీటికి మూడేళ్ల కాల పరిమితి ముగిసినందున కొత్త ఫీజుల ఖరారు కోసం యాజమాన్యాల నుంచి కమిషన్ వార్షిక ఆదాయ, వ్యవ వివరాలను కోరింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో 14 ప్రైవేట్, 11 డెంటల్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వివరాలను ప్రభుత్వానికి సమర్పించాయి.
దీంతో ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కాలేజీ యాజమాన్యాలతో రెండు రోజుల పాటు సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. కాలేజీల నిర్వహణ ఖర్చులు, ఆస్పత్రి నిర్వహణలో కొన్ని ఖర్చులను, జాతీయ వైద్య మండలి జరిపిన తనిఖీల కోసం యాజమాన్యాల తరపున అధికారికంగా జరిగిన చెల్లింపులను కూడా ఫీజుల పరిగణలోకి తీసుకుంది. ఈ భేటీలో ప్రస్తుతం చెల్లించే ఫీజుల్లో కనీసం 20 శాతం, ఆపైన తగ్గే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ తగ్గింపు కన్వీనర్ కోటాలోనే కాకుండా యాజమాన్య కోటా ఫీజుల్లోనూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఓ కాలేజీలో యాజమాన్య కోటాలో ఒక కేటగిరి సీటు భర్తీ ఫీజును 18 లక్షల రూపాయలకు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 24 లక్షల రూపాలయ వరకూ మెడికల్ సీటుకు ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే ఒకే తరహా ఫీజు విధానాన్నే అనుసరించాలని, కరోనా సేవల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని యాజమాన్యాల ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి:
ఇట్స్ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా