జగన్‌కు రమణ దీక్షితుల ఆశీస్సులు

| Edited By:

May 16, 2019 | 6:31 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండ్రోజుల నుంచి పులివెందులలోని పార్టీ కార్యాలయంలో జగన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందుకు కూడా జగన్ హాజరయ్యారు. గురువారం సాయంత్రం తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు.

జగన్‌కు రమణ దీక్షితుల ఆశీస్సులు
Follow us on

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండ్రోజుల నుంచి పులివెందులలోని పార్టీ కార్యాలయంలో జగన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందుకు కూడా జగన్ హాజరయ్యారు. గురువారం సాయంత్రం తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు.